ETV Bharat / state

70 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.. వాహనం సీజ్ - Ration Rice Seized latest News

పేదలకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇచ్చేందుకు తెచ్చిన జగనన్న ఇంటి ఇంటికి రేషన్ బియ్యం వాహనాల్లో అక్రమం రాజ్యమేలుతోంది. ఫలితంగా పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ప్రైవేట్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం 70 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు.

rice-and-vehicle-seized
rice-and-vehicle-seized
author img

By

Published : Apr 13, 2021, 5:26 PM IST

Updated : Apr 13, 2021, 9:43 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్‌ వాహనం నుంచి మరో వాహనంలోకి బియ్యం తరలింపు ప్రక్రియ చేస్తుండగా అధికారులు దాడులు నిర్వహించారు. పొన్నూరుకు బియ్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.. 70 బస్తాల రేషన్‌ బియ్యాన్ని సీజ్ చేశారు.

DS Rice Smugling in Govt Rice vehicle
పట్టుబడిన రేషన్ బియ్యం

'ప్రజాగ్రహం'

పేదలకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇచ్చేందుకు తెచ్చిన జగనన్న ఇంటి ఇంటికి రేషన్ బియ్యం వాహనాలు అవినీతికి అడ్డగా మారుతోంది. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు నేరుగా అధికార వాహనాలనే వినియోగిస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిందితులపై కేసు నమోదు..

ప్రైవేట్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని.. రామకోటయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రేషన్ వాహనాల సిబ్బందిపై తొలుత కేసు నమోదు చేయలేదు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఫణీంద్ర స్పందించి.. బియ్యం తరలిస్తున్న ప్రభుత్వ వాహనాల వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సదరు వాహన సిబ్బందిని తొలగించి.. ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వాహనాలు నుంచి బియ్యం తరలిస్తున్న వెంకటేష్, సాంబయ్యపై కేసు రిజిస్టర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్‌ వాహనం నుంచి మరో వాహనంలోకి బియ్యం తరలింపు ప్రక్రియ చేస్తుండగా అధికారులు దాడులు నిర్వహించారు. పొన్నూరుకు బియ్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.. 70 బస్తాల రేషన్‌ బియ్యాన్ని సీజ్ చేశారు.

DS Rice Smugling in Govt Rice vehicle
పట్టుబడిన రేషన్ బియ్యం

'ప్రజాగ్రహం'

పేదలకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇచ్చేందుకు తెచ్చిన జగనన్న ఇంటి ఇంటికి రేషన్ బియ్యం వాహనాలు అవినీతికి అడ్డగా మారుతోంది. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు నేరుగా అధికార వాహనాలనే వినియోగిస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిందితులపై కేసు నమోదు..

ప్రైవేట్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని.. రామకోటయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రేషన్ వాహనాల సిబ్బందిపై తొలుత కేసు నమోదు చేయలేదు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఫణీంద్ర స్పందించి.. బియ్యం తరలిస్తున్న ప్రభుత్వ వాహనాల వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సదరు వాహన సిబ్బందిని తొలగించి.. ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వాహనాలు నుంచి బియ్యం తరలిస్తున్న వెంకటేష్, సాంబయ్యపై కేసు రిజిస్టర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు

Last Updated : Apr 13, 2021, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.