తెలంగాణ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి విజయవాడకు చెందిన ఏసుదాసు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆటోనగర్ సమీపంలో జరిగింది. మృతుడు తమ బంధువుల వ్యక్తి మృతి చెందడంతో.. దానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా కార్డులు పంచేందుకు గుంటూరు వచ్చాడు.
ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లోకి తిరుగుతుండగా.. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీకి చెందిన మణుగూరు నుంచి కనిగిరి వెళుతున్న బస్సు అదే దారిలో వచ్చింది. దానిని గమనించి తప్పించే క్రమంలో ఏసుదాసు నడుపుతున్న ద్విచక్రవాహనం కిందపడ్డాడు. ఆ సమయంలో బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో ఏసుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. పెదకాకాని పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: