ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై సీఎం జగన్​కు ఎమ్మెల్యే అనగాని లేఖ

author img

By

Published : Jan 29, 2021, 4:00 PM IST

ప్రాణాలకు తెగించి కరోనా విధుల్లో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు నిలిపివేయడంపై.. సీఎం జగన్​కు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. కొవిడ్ విధుల్లో పాల్గొని మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

repalle mla anagani letter to cm jagan about sanitary workers problems
సీఎం జగన్​కు రేపల్లె ఎమ్మెల్యే అనగాని లేఖ
repalle mla anagani letter to cm jagan about sanitary workers problems
సీఎం జగన్​కు ఎమ్మెల్యే అనగాని రాసిన లేఖ

పారిశుద్ధ్య కార్మికుల జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆరోగ్య భత్యం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రాణాలకు తెగించి కరోనా విధుల్లో పాల్గొన్నా.. వారికి జీతాలు నిలిపేయడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఆపడం విడ్డూరమని విమర్శించారు.

కరోనా సమయంలో 20 శాతం మంది పారిశుద్ధ్య కార్మికులను అదనంగా విధుల్లోకి తీసుకుని.. ఇప్పుడు తొలగించడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విధుల్లో పాల్గొన్న మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ వర్క్ విభాగానికి చెందిన 9,700 మంది కార్మికులకు.. జీతాల్లో 10 శాతం కోత విధించారని మండిపడ్డారు. చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని లేఖలో డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సామాన్య ప్రయాణికుల్లా ప్రజాప్రతినిధి

repalle mla anagani letter to cm jagan about sanitary workers problems
సీఎం జగన్​కు ఎమ్మెల్యే అనగాని రాసిన లేఖ

పారిశుద్ధ్య కార్మికుల జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆరోగ్య భత్యం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రాణాలకు తెగించి కరోనా విధుల్లో పాల్గొన్నా.. వారికి జీతాలు నిలిపేయడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఆపడం విడ్డూరమని విమర్శించారు.

కరోనా సమయంలో 20 శాతం మంది పారిశుద్ధ్య కార్మికులను అదనంగా విధుల్లోకి తీసుకుని.. ఇప్పుడు తొలగించడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విధుల్లో పాల్గొన్న మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ వర్క్ విభాగానికి చెందిన 9,700 మంది కార్మికులకు.. జీతాల్లో 10 శాతం కోత విధించారని మండిపడ్డారు. చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని లేఖలో డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సామాన్య ప్రయాణికుల్లా ప్రజాప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.