ETV Bharat / state

MLA Anagani letter to CM: సీఎం జగన్‌కు రేపల్లె ఎమ్మెల్యే లేఖ..ఎందుకంటే..!

author img

By

Published : Mar 13, 2022, 12:11 PM IST

mla anagani satyaprasad letter to cm jagan : సీఎం జగన్​కు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 9 నెలలుగా పోలీసుల డీఏ పెండింగ్ పెట్టారని.. మరోవైపు పోస్టులు భర్తీ చేయకపోవటంతో వారిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

MLA Anagani
MLA Anagani

MLA Anagani Satyaprasad letter to cm jagan : శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహిస్తున్న పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. 9 నెలలుగా పోలీసుల డీఏ పెండింగ్​లో పెట్టారని.. 6 నెలలుగా అలవెన్స్​ల బిల్లులు పెట్టటం లేదన్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో.. వారిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20,841 పోలీసు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇస్తామన్న మాటకు కట్టుబడాలి..

పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామన్న మాటకు కట్టుబడాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన 300 మంది పోలీసు కుటుంబాలకు సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. దుర్భర పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సీఎం జగన్​ను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు.

MLA Anagani Satyaprasad letter to cm jagan : శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహిస్తున్న పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. 9 నెలలుగా పోలీసుల డీఏ పెండింగ్​లో పెట్టారని.. 6 నెలలుగా అలవెన్స్​ల బిల్లులు పెట్టటం లేదన్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో.. వారిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20,841 పోలీసు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇస్తామన్న మాటకు కట్టుబడాలి..

పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామన్న మాటకు కట్టుబడాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన 300 మంది పోలీసు కుటుంబాలకు సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. దుర్భర పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సీఎం జగన్​ను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు.

ఇదీ చదవండి :

"25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచుతానన్నావుగా..?"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.