ETV Bharat / state

170వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

author img

By

Published : Jun 4, 2020, 4:37 PM IST

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 170వ రోజుకు చేరుకున్నాయి. 170 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలే తమకు న్యాయం చేస్తాయని భరోసా పెట్టుకున్నారు.

170వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు
170వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నాలు 170వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం, అనంతవరం, తుళ్లూరు, వెంకటపాలెం, మందడం గ్రామాల్లో రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే ఆందోళనలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా, ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయస్థానాలు అండగా నిలుస్తాయని రైతులు విశ్వాసం వ్యక్తంచేశారు. తమ ఆందోళనలు 170 రోజులకు చేరుకున్నా ప్రభుత్వం నుంచి ఇసుమంతైనా స్పందన లేదని వాపోయారు.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నాలు 170వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం, అనంతవరం, తుళ్లూరు, వెంకటపాలెం, మందడం గ్రామాల్లో రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే ఆందోళనలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా, ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయస్థానాలు అండగా నిలుస్తాయని రైతులు విశ్వాసం వ్యక్తంచేశారు. తమ ఆందోళనలు 170 రోజులకు చేరుకున్నా ప్రభుత్వం నుంచి ఇసుమంతైనా స్పందన లేదని వాపోయారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.