ETV Bharat / state

దాచేపల్లిలో పోలీసుల తనిఖీలు.. 4 లక్షల మద్యం స్వాధీనం

author img

By

Published : Mar 31, 2021, 8:26 AM IST

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ బాల నాగిరెడ్డి తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ 4 లక్షలు ఉంటుందన్న ఆయన.. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని.. కారును సీజ్ చేసినట్లు వివరించారు.

4 lakh liquor seized
పట్టుబడ్డ అక్రమ మద్యం

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగులచెక్ పోస్ట్, కాట్రపాడు ప్రాంతాల్లో భారీ ఎత్తున మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. బస్సులో అక్రమంగా తరలిస్తున్న 100 మద్యం ఫుల్ బాటిళ్లను.. కాట్రపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న 750 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని, కారును సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సులభంగా డబ్బులు సంపాదించాలని.. మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తే.. కఠినంగా శిక్షలు పడతాయని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగులచెక్ పోస్ట్, కాట్రపాడు ప్రాంతాల్లో భారీ ఎత్తున మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. బస్సులో అక్రమంగా తరలిస్తున్న 100 మద్యం ఫుల్ బాటిళ్లను.. కాట్రపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న 750 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని, కారును సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సులభంగా డబ్బులు సంపాదించాలని.. మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తే.. కఠినంగా శిక్షలు పడతాయని హెచ్చరించారు.

ఇవీ చూడండి...: సీఎంఏ ఫలితాల్లో మెరిసిన గుంటూరు విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.