ETV Bharat / state

వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు.. ఎవరు చేశారో? - వ్యక్తిపై పెట్రోల్ పోసిన దుండగులు న్యూస్

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని కొత్తనాగిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై దుండగులు.. పెట్రోల్ పోసి.. సజీవ దహనం చేశారు.

వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన దుండగులు.. ఎవరు చేశారో?
వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన దుండగులు.. ఎవరు చేశారో?
author img

By

Published : Jun 2, 2021, 12:46 PM IST

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని కొత్తనాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న వ్యక్తిపై.. దుండగులు పెట్రోల్ పోసి కిరాతకంగా సజీవ దహనం చేశారు. గ్రామానికి చెందిన కర్లకుంట గురవయ్య(71), ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు వచ్చారు. అతడి ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. శరీరమంతా పూర్తిగా కాలిపోయిన గురవయ్యను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు గుంటూరుకు సిఫార్సు చేశారు. అంబులెన్స్​లో తీసుకెళ్తుండగా.. పరిస్థితి విషమించడంతో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. గురవయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని కొత్తనాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న వ్యక్తిపై.. దుండగులు పెట్రోల్ పోసి కిరాతకంగా సజీవ దహనం చేశారు. గ్రామానికి చెందిన కర్లకుంట గురవయ్య(71), ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు వచ్చారు. అతడి ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. శరీరమంతా పూర్తిగా కాలిపోయిన గురవయ్యను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు గుంటూరుకు సిఫార్సు చేశారు. అంబులెన్స్​లో తీసుకెళ్తుండగా.. పరిస్థితి విషమించడంతో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. గురవయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Anandayya Medicine: కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఔషధం తయారీకి ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.