ETV Bharat / state

లాడ్జ్​లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - guntur district latest news

పిడుగురాళ్లలోని ఓ లాడ్జిలో నీరుమళ్ల సురేష్​ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హైదరాబాద్​ నుంచి తన స్వగ్రామానికి వస్తూ పిడుగురాళ్లలో బస చేశాడు. సాయంత్రం అయినా తలుపులు తెరవకపోవడం వల్ల అనుమానం వచ్చిన హోటల్ సిబ్బందికి.. సురేష్ ఫ్యాన్​కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.

person died in hotel in pidugurala
పిడుగురాళ్లలోని హోటల్​లో వ్యక్తి మృతి
author img

By

Published : Jun 22, 2020, 6:28 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బస్టాండ్​ వద్ద గల ఓ లాడ్జిలో నీరుమళ్ల సురేష్​ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇతను మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లో వసతి గృహాలను నిర్వహిస్తున్న సురేష్​ కరోనా కారణంగా హాస్టళ్లు మూత పడటం వల్ల స్వగ్రామానికి వెళ్లే క్రమంలో.. పిడుగురాళ్లలోని హోటల్​లో బస చేశాడు. సాయంత్రం రూం బాయ్​ తలుపులు తట్టినా తీయకపోవడం వల్ల అనుమానంతో కిటికీలోంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా ఉండడాన్ని సిబ్బంది గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పవన్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బస్టాండ్​ వద్ద గల ఓ లాడ్జిలో నీరుమళ్ల సురేష్​ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇతను మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లో వసతి గృహాలను నిర్వహిస్తున్న సురేష్​ కరోనా కారణంగా హాస్టళ్లు మూత పడటం వల్ల స్వగ్రామానికి వెళ్లే క్రమంలో.. పిడుగురాళ్లలోని హోటల్​లో బస చేశాడు. సాయంత్రం రూం బాయ్​ తలుపులు తట్టినా తీయకపోవడం వల్ల అనుమానంతో కిటికీలోంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా ఉండడాన్ని సిబ్బంది గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పవన్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి:

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.