ETV Bharat / state

'ఇళ్ల పట్టాల పేరుతో భూములను లాక్కున్నారు' - guntur latest news

అధికారులు, వైకాపా నాయకులు ఇళ్ల పట్టాల పేరిట తమ భూములను లాక్కున్నారని గుంటూరు జిల్లా రైతులు.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ పంటను నాశనం చేసి రోడ్లు వేస్తున్నారని.. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారని వాపోయారు.

patha ganeshudipadu farmers complaint to guntur rural sp
'ఇళ్ల పట్టాల పేరిట భూములను లాక్కున్నారు'
author img

By

Published : Feb 23, 2021, 5:59 PM IST

ఇళ్ల పట్టాల పేరిట తమ భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారంటూ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడుకు చెందిన రైతులు... గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమ జీవనాధారమైన భూమిని ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో అధికారులు, వైకాపా నాయకులు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటను నాశనం చేసి రోడ్లు వేస్తున్నారని.. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారని వాపోయారు. తమను, తమ భూముల్ని కాపాడాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. 60 ఏళ్లుగా బంజరుభూమిని సాగుచేస్తున్న తమకు 2007లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు.

'ఇళ్ల పట్టాల పేరిట భూములను లాక్కున్నారు'

ఇదీ చదవండి

సీఎం జగన్‌కు అమరావతి రైతులనుంచి నిరసన సెగ

ఇళ్ల పట్టాల పేరిట తమ భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారంటూ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడుకు చెందిన రైతులు... గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమ జీవనాధారమైన భూమిని ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో అధికారులు, వైకాపా నాయకులు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటను నాశనం చేసి రోడ్లు వేస్తున్నారని.. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారని వాపోయారు. తమను, తమ భూముల్ని కాపాడాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. 60 ఏళ్లుగా బంజరుభూమిని సాగుచేస్తున్న తమకు 2007లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు.

'ఇళ్ల పట్టాల పేరిట భూములను లాక్కున్నారు'

ఇదీ చదవండి

సీఎం జగన్‌కు అమరావతి రైతులనుంచి నిరసన సెగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.