ETV Bharat / state

'ఆ వ్యాఖ్యలు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం'

author img

By

Published : Aug 30, 2020, 9:05 PM IST

రాష్ట్రాభివృద్ధిని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదని అన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనలకు ప్రభుత్వ వైఫల్యం అనడం సరికాదన్నారు.

మోపిదేవి వెంకటరమణ
మోపిదేవి వెంకటరమణ

రాష్ట్రాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. ఇలాంటి ప్రభుత్వంపై తెదేపా నేతలు బురద చల్లడం మంచిది కాదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తెదేపా నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మోపిదేవి అన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనలకు ప్రభుత్వ వైఫల్యం అనడం సరికాదన్నారు. రాష్ట్రంలో దళితులు, బీసీలకు రక్షణ లేదని వ్యాఖ్యానించడం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

రాష్ట్రాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. ఇలాంటి ప్రభుత్వంపై తెదేపా నేతలు బురద చల్లడం మంచిది కాదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తెదేపా నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మోపిదేవి అన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనలకు ప్రభుత్వ వైఫల్యం అనడం సరికాదన్నారు. రాష్ట్రంలో దళితులు, బీసీలకు రక్షణ లేదని వ్యాఖ్యానించడం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.