గుంటూరు జిల్లాలో.. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఏఈ లంచాలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని అన్నదాతలు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకున్న సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వాలని ఏఈని ఆదేశించారు. క్రోసూరు మండలంలో విద్యుత్ శాఖ ఏఈగా పని చేస్తున్న అంజనీ రావు అనే ప్రభుత్వ ఉద్యోగి ఈ అవినీతికి పాల్పడ్డాడు.
మండలంలోని ఎర్రబాలెం, క్రోసూరుతో పాటు పలు గ్రామాల్లో కొత్త కరెంట్ కనెక్షన్లు ఇచ్చేెందుకు లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నేడు నిర్వహించిన రైతు దినోత్సవానికి పెదకూరపాడుకు వచ్చిన సదరు ఎమ్మెల్యేకు ఈ విషయమై రైతులు ఫిర్యాదు చేశారు. తీసుకున్న డబ్బును సాయంత్రానికల్లా తిరిగి చెల్లించాలని ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. అంజనీరావుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి:
HOME MINISTER: 'అన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయ పరీక్షా కేంద్రాలు'