ETV Bharat / state

ఇంటింటికీ ఆరోగ్య సర్వే సమావేశంలో పాల్గొన్న మంత్రి మోపిదేవి - ఇంటింటికీ ఆరోగ్య సర్వే సమావేశంలో పాల్గొన్న మంత్రి మోపిదేవి

ఇంటింటికీ ఆరోగ్య సర్వే కార్యక్రమ సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ కరోనా నిర్మూలనకు సహకరించాలని పిలుపునిచ్చారు.

minister mopidevi participate in initintiki arogya survey in repalley
ఇంటింటికీ ఆరోగ్య సర్వే సమావేశంలో పాల్గొన్న మంత్రి మోపిదేవి
author img

By

Published : Apr 13, 2020, 4:40 PM IST

కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లెలో రెడ్​క్రాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటింటికీ ఆరోగ్య సర్వే కార్యక్రమానికి సంబంధించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ప్రభావంతో వణుకుతున్నాయని మోపిదేవి అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కాపాడేందుకు వైద్య రంగం అహిర్నిశలు కృషి చేస్తోందని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా విధి నిర్వహణలో వైద్యులు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన విషయమని విచారం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ కారణంగా రైతులకు నష్టం లేకుండా పంటను ప్రభుత్వమే కొనగోలు చేసి ఆదుకుంటుందన్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు కనీస దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే, వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.

కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లెలో రెడ్​క్రాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటింటికీ ఆరోగ్య సర్వే కార్యక్రమానికి సంబంధించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ప్రభావంతో వణుకుతున్నాయని మోపిదేవి అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కాపాడేందుకు వైద్య రంగం అహిర్నిశలు కృషి చేస్తోందని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా విధి నిర్వహణలో వైద్యులు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన విషయమని విచారం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ కారణంగా రైతులకు నష్టం లేకుండా పంటను ప్రభుత్వమే కొనగోలు చేసి ఆదుకుంటుందన్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు కనీస దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే, వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: తెనాలిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.