తెనాలిలో నిమ్మ రైతులు మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిశారు. నిమ్మ మార్కెట్లో ఈనామ్ పెట్టొద్దని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... రైతుల సమస్యల గురించి అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతామని హామీఇచ్చారు. స్థానిక నేతలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి త్వరలో రైతులతో కమిటీ వేస్తామని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ నామ్ విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇదీ చదవండీ...