ETV Bharat / state

మంగళగిరిలోని పలు గ్రామాల్లో పది రోజులపాటు లాక్​డౌన్​ - మంగళగిరిలో పది రోజులపాటు లాక్​డౌన్

పది రోజులపాటు పలు గ్రామాల్లో లాక్​డౌన్​ విధిస్తున్నట్లు.. గుంటూరు జిల్లా మంగళగిరి తహసీల్దార్ రామ్​ ప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్​లో రోజూ 200లకు పైగా కొవిడ్ కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

lockdown in mangalagiri
మంగళగిరిలో లాక్​డౌన్
author img

By

Published : Apr 26, 2021, 5:08 PM IST

లాక్​డౌన్​ వివరాలు వెల్లడిస్తున్న తహసీల్దార్ రామ్​ ప్రసాద్

గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్​లో రోజుకి 200లకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో.. అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి, కొవిడ్ ఇన్సిడెంట్ కమాండెంట్ రామ్ ప్రసాద్ ఇతర అధికారులతో చర్చించారు. మంగళగిరిలోని 32కు గాను 24 వార్డుల్లో మైక్రో కంటైన్​మెంట్ జోన్​లు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ రామ్ ప్రసాద్ ప్రకటించారు. మండలంలో వడ్లపూడి, నూతక్కి, రామచంద్రాపురం, కాజ, చినకాకాని, ఆత్మకూరుల్లో పూర్తిస్థాయి లాక్​డౌన్ విధిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: ఉచిత ఆక్సిజన్​తో 5,500 మందిని కాపాడిన యువకుడు!

ఈ నెల 28 నుంచి ఆయా జోన్​లలో లాక్​డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయమని రామ్​ ప్రసాద్ తెలిపారు. ఇక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు, రేపటిలోపు నిత్యావసర సరుకులు, కూరగాయలు సమకూర్చుకోవాలని సూచించారు. 10రోజులపాటు ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి పొడగింపు లేదా పాక్షికంగా సడలించే అవకాశాన్ని పరిశీలస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రెమిడెసివర్​ కోసం రాజకీయ నాయకుల రికమండేషన్లు..సరికాదంటున్న వైద్యులు

లాక్​డౌన్​ వివరాలు వెల్లడిస్తున్న తహసీల్దార్ రామ్​ ప్రసాద్

గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్​లో రోజుకి 200లకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో.. అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి, కొవిడ్ ఇన్సిడెంట్ కమాండెంట్ రామ్ ప్రసాద్ ఇతర అధికారులతో చర్చించారు. మంగళగిరిలోని 32కు గాను 24 వార్డుల్లో మైక్రో కంటైన్​మెంట్ జోన్​లు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ రామ్ ప్రసాద్ ప్రకటించారు. మండలంలో వడ్లపూడి, నూతక్కి, రామచంద్రాపురం, కాజ, చినకాకాని, ఆత్మకూరుల్లో పూర్తిస్థాయి లాక్​డౌన్ విధిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: ఉచిత ఆక్సిజన్​తో 5,500 మందిని కాపాడిన యువకుడు!

ఈ నెల 28 నుంచి ఆయా జోన్​లలో లాక్​డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయమని రామ్​ ప్రసాద్ తెలిపారు. ఇక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు, రేపటిలోపు నిత్యావసర సరుకులు, కూరగాయలు సమకూర్చుకోవాలని సూచించారు. 10రోజులపాటు ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి పొడగింపు లేదా పాక్షికంగా సడలించే అవకాశాన్ని పరిశీలస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రెమిడెసివర్​ కోసం రాజకీయ నాయకుల రికమండేషన్లు..సరికాదంటున్న వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.