పన్నుల భారం తగ్గించేందుకు కృషి చేస్తా: కోవెలమూడి రవీంద్ర - guntur district latest news
ప్రజలపై పన్నుల భారం తగ్గించటంతోపాటు... గుంటూరు అభివృద్ధే లక్ష్యంగా నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలుగుదేశం మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గుంటూరు అభివృద్ధి అటకెక్కిందని ఆయన విమర్శించారు. రాజధాని తరలింపు.. గుంటూరు, విజయవాడ నగరాల అభివృద్ధికి శరాఘాతమంటున్న కోవెలమూడి రవీంద్రతో ఈటీవీ భారత్ ముఖాముఖి.