జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల అధికారాల్ని సంయుక్త కలెక్టర్లకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 64ను ఉపసంహరించుకోవాలని.. ఐఎంఏ రాష్ట్ర విభాగం కార్యదర్శి డాక్టర్ నందకిషోర్ డిమాండ్ చేశారు. పాతికేళ్లకుపైగా వైద్య సేవల్లో ఉన్న వారికే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులుగా గుర్తింపు వస్తుందని, ఆరోగ్యపరమైన అంశాలపై వారికి లోతైన అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. జేసీలకు పని కల్పించటం కోసం డీఎంహెచ్వోల స్థాయి తగ్గించటం సరికాదని అభిప్రాయపడ్డారు. జీవోను ఉపసంహరించుకోకుంటే డాక్టర్స్ డే వేడుకలు బహిష్కరిస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి.