ETV Bharat / state

మాకేవి ఇళ్ల స్థలాలు: హోంమంత్రి ఎదుట ఆందోళన - కాకుమానులో ఇళ్ల స్థలాల గందరగోళం వార్తలు

గుంటూరు జిల్లా కాకుమానులో ఇళ్ల స్థలాల పంపిణీ విషయం ఉద్రిక్తతకు దారి తీసింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఇళ్ల స్థలాలు అందజేస్తున్న సమయంలో స్థానిక వైకాపా నాయకుడు, మరి కొంతమంది మహిళలు ఆందోళనకు దిగారు.

మాకేవి ఇళ్ల స్థలాలు: హోంమంత్రి ఎదుట ఆందోళన
మాకేవి ఇళ్ల స్థలాలు: హోంమంత్రి ఎదుట ఆందోళన
author img

By

Published : Dec 29, 2020, 4:11 AM IST

Updated : Dec 31, 2020, 12:56 PM IST

తమకు ఇళ్ల స్థలాలు ఎందుకు కేటాయించలేదని అధికారులు, నాయకులను కాకుమానులో కొంతమంది గ్రామస్థులు ప్రశ్నించారు. వైకాపా నాయకుడు భద్రయ్య సమస్యను తెలిపేందుకు హోంమంత్రి సుచరిత వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సమస్య వివరాలు చెప్పాలని కోరగా అయినా పోలీసులు నిరాకరించడంతో అతను ముందుకు వెళ్ళాడు. పోలీసులు నాయకుడి చొక్కా పట్టుకుని వెనక్కి లాగి పక్కకు తోశారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని.. తమకు ఎందుకు ఇవ్వలేదని.. హోంమంత్రికి సమస్య తెలిపేందుకు వెళ్లనీయకుండా పోలీసులు తాడు అడ్డుగా కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోపణలు చేయకండి

స్థలాలు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకునే వెళ్తానని హోంమంత్రి సుచరిత చెప్పారు. కొన్ని నిబంధనలు ఉంటాయని... స్థలం ఎందుకు రాలేదో... తెలుసుకోకుండా మొండిగా ఆరోపణలు చేయవద్దన్నారు. నివేశన స్థలాల జాబితాను అధికారులు సచివాలయంలో ప్రచురించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్​

తమకు ఇళ్ల స్థలాలు ఎందుకు కేటాయించలేదని అధికారులు, నాయకులను కాకుమానులో కొంతమంది గ్రామస్థులు ప్రశ్నించారు. వైకాపా నాయకుడు భద్రయ్య సమస్యను తెలిపేందుకు హోంమంత్రి సుచరిత వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సమస్య వివరాలు చెప్పాలని కోరగా అయినా పోలీసులు నిరాకరించడంతో అతను ముందుకు వెళ్ళాడు. పోలీసులు నాయకుడి చొక్కా పట్టుకుని వెనక్కి లాగి పక్కకు తోశారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని.. తమకు ఎందుకు ఇవ్వలేదని.. హోంమంత్రికి సమస్య తెలిపేందుకు వెళ్లనీయకుండా పోలీసులు తాడు అడ్డుగా కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోపణలు చేయకండి

స్థలాలు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకునే వెళ్తానని హోంమంత్రి సుచరిత చెప్పారు. కొన్ని నిబంధనలు ఉంటాయని... స్థలం ఎందుకు రాలేదో... తెలుసుకోకుండా మొండిగా ఆరోపణలు చేయవద్దన్నారు. నివేశన స్థలాల జాబితాను అధికారులు సచివాలయంలో ప్రచురించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్​

Last Updated : Dec 31, 2020, 12:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.