గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలు కేసుల విచారణలో అలక్ష్యంగా వ్యవహరించటం ఇద్దరి సస్పెన్షన్కు కారణమని పోలీసువర్గాలు చెబుతున్నా.. అంతర్గతంగా రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటాను మరో ప్రజాప్రతినిధికి అందించారని... సదరు ప్రజాప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డేటాను అనధికారికంగా ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు ఇద్దరిపైనా వేటు వేసినట్టు భావిస్తున్నారు.
ఇదీచదవండి