ETV Bharat / state

'లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు... పట్టాలు అందిస్తాం'

author img

By

Published : Nov 17, 2020, 7:25 PM IST

గుంటూరు నగరంలో టిడ్కో గృహాల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసి వెనక్కి తీసుకోవటం పట్ల నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధ వివరణ ఇచ్చారు. లబ్ధిదారుల ఫోటో,అధికారి సంతకంతో పట్టాలను పంపిణీ చేయాల్సి ఉందని... కొందరి ఫొటోలు లేకుండానే పంపిణీ అయిన కారణంగా వారి వద్ద నుంచి పట్టాను వెనక్కి తీసుకున్నామని చెప్పారు.

'లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు...పట్టాలు అందిస్తాం'
'లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు...పట్టాలు అందిస్తాం'

గుంటూరు నగరంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గిరిధర్‌ టిడ్కో గృహాల పట్టాలను ఇవాళ పంపిణీ చేశారు. అయితే ఇచ్చినట్లే ఇచ్చి మరలా పట్టాలను వెనక్కి తీసుకోవటం పట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధ స్పందిస్తూ... లబ్ధిదారుల ఫొటో, ఫొటోపై అధికారి సంతకంతో పట్టాలను పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు.

కొందరి ఫొటోలు లేకుండానే పంపిణీ అయిన కారణంగా వారి నుంచి పట్టాను వెనక్కి తీసుకున్నామని కమిషనర్‌ పేర్కొన్నారు. టిడ్కొ గృహాలకు సంబంధించి ఇప్పటికే సామాజిక ఆడిట్‌ పూర్తయ్యిందని చెప్పారు. లబ్ధిదారుల పట్టాలను వారికే అందిస్తామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

గుంటూరు నగరంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గిరిధర్‌ టిడ్కో గృహాల పట్టాలను ఇవాళ పంపిణీ చేశారు. అయితే ఇచ్చినట్లే ఇచ్చి మరలా పట్టాలను వెనక్కి తీసుకోవటం పట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధ స్పందిస్తూ... లబ్ధిదారుల ఫొటో, ఫొటోపై అధికారి సంతకంతో పట్టాలను పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు.

కొందరి ఫొటోలు లేకుండానే పంపిణీ అయిన కారణంగా వారి నుంచి పట్టాను వెనక్కి తీసుకున్నామని కమిషనర్‌ పేర్కొన్నారు. టిడ్కొ గృహాలకు సంబంధించి ఇప్పటికే సామాజిక ఆడిట్‌ పూర్తయ్యిందని చెప్పారు. లబ్ధిదారుల పట్టాలను వారికే అందిస్తామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

ఇదీ చదవండి:

సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ బెయిల్‌ రద్దు పిటిషన్​పై విచారణ 19కి వాయిదా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.