ప్రభుత్వం మద్యం దుకాణం నుంచి అధిక సంఖ్యలో మద్యం తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో జరిగింది. రాంభోట్ల వారిపాలెంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి 100 మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరితోపాటు మద్యం అమ్మిన సేల్స్మెన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెరుకుపల్లి ఎస్సై రమేశ్ తెలిపారు. మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :
వీరులపాడు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత