ETV Bharat / state

మరియమ్మకు అంత్యక్రియలు పూర్తి.. రూ.10 లక్షలు అందించిన హోంమంత్రి

వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిన్న అర్థరాత్రి ఆమె మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారాన్ని హోంమంత్రి.. బాధిత కుటుంబానికి అందించారు.

author img

By

Published : Dec 29, 2020, 8:55 AM IST

Updated : Dec 29, 2020, 10:33 AM IST

velagapudi taza
velagapudi taza

రాజధాని గ్రామమైన వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మహిళ మరియమ్మ (50) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సోమవారం గ్రామం అట్టుడికిపోయింది. రోజంతా రెండు వర్గాల ఆందోళనలు, బైఠాయింపులు, నినాదాలతో రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వెనక ఎంపీ నందిగం సురేశ్‌ ప్రోద్బలం ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు.

మృతదేహంతో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఈనేపథ్యంలో అర్ధరాత్రి ఎస్సీ సంఘాలతో ఏపీ హోం మంత్రి సుచరిత చర్చలు జరిపారు. ఎంపీ సురేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతామని హోం మంత్రి హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారాన్ని హోంమంత్రి సుచరిత అందించారు.

రాజధాని గ్రామమైన వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మహిళ మరియమ్మ (50) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సోమవారం గ్రామం అట్టుడికిపోయింది. రోజంతా రెండు వర్గాల ఆందోళనలు, బైఠాయింపులు, నినాదాలతో రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వెనక ఎంపీ నందిగం సురేశ్‌ ప్రోద్బలం ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు.

మృతదేహంతో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఈనేపథ్యంలో అర్ధరాత్రి ఎస్సీ సంఘాలతో ఏపీ హోం మంత్రి సుచరిత చర్చలు జరిపారు. ఎంపీ సురేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతామని హోం మంత్రి హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారాన్ని హోంమంత్రి సుచరిత అందించారు.

ఇదీ చదవండి:

వెలగపూడిలో రణరంగం.. స్వాగత తోరణానికి పేరుపెట్టే విషయంలో విభేదాలు

Last Updated : Dec 29, 2020, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.