ETV Bharat / state

అగ్రిగోల్డ్​ బాధితులకు శుభవార్త.. తొలి విడత చెల్లింపులకు అనుమతి - అగ్రిగోల్డ్​ బాధితులకు చెల్లింపులు

అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలివిడత చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వేలలోపు డిపాజిట్లు ఉన్న చిన్న డిపాజిటర్లకు మొదట చెల్లింపు చేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. 264 కోట్ల నిధుల విడుదలకు పాలనా అనుమతులు మంజూరయ్యాయి. వీటిని జిల్లా కలెక్టర్లు, డిపాజిటర్లకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

అగ్రిగోల్డ్​ బాధితులకు తొలి విడత చెల్లింపులు
author img

By

Published : Oct 19, 2019, 1:23 PM IST

అగ్రిగోల్డ్​ బాధితులకు తొలి విడత చెల్లింపులు

అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడత చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న చిన్న డిపాజిటర్లకు తొలుత పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. దీనికోసం 264 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేసేందుకు పాలనా అనుమతుల్ని ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మొత్తం 3 లక్షల 69 వేల 655 మంది డిపాజిటర్లకు తొలివిడత పరిహారం అందనుంది. జిల్లాల లీగల్ సెల్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు.

మరోవైపు 20 వేల లోపు ఉన్న డిపాజిటర్లకూ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. హైకోర్టు అనుమతి రాగానే చెల్లింపులు చేపట్టాలని భావిస్తోంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారాన్ని చెల్లించేందుకు వీలుగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 1,150 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగానే తొలివిడతగా 264 కోట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే 10వేల లోపు డిపాజిటర్ల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు.

జిల్లాల వారీగా అగ్రిగోల్డ్​ బాధితులకు చెల్లింపులు
జిల్లా చిన్న డిపాజిటర్లు చెల్లింపులు (రూ.లలో)
గుంటూరు 19,751 14,09,41,615
చిత్తూరు 8,257 5,81,17,100
తూర్పుగోదావరి జిల్లా 19,545 11,46,87,619
పశ్చిమ గోదావరి 35,496 23,05,98,695
విజయనగరం జిల్లా 57,941 36,97,96,900
శ్రీకాకుళం 45,833 31,41,59,741
కర్నూలు 15,705 11,14,83,494
నెల్లూరు 24,390 16,91,74,466
కృష్ణాజిల్లా 21,444 15,04,77,760
అనంతపురం 23,838 20,64,21,009
కడప జిల్లా 18,864 13,18,06,875
ప్రకాశంజిల్లా 26,586 19,11,50,904
విశాఖ జిల్లా 52,005 45,10,85,805

అగ్రిగోల్డ్​ బాధితులకు తొలి విడత చెల్లింపులు

అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడత చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న చిన్న డిపాజిటర్లకు తొలుత పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. దీనికోసం 264 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేసేందుకు పాలనా అనుమతుల్ని ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మొత్తం 3 లక్షల 69 వేల 655 మంది డిపాజిటర్లకు తొలివిడత పరిహారం అందనుంది. జిల్లాల లీగల్ సెల్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు.

మరోవైపు 20 వేల లోపు ఉన్న డిపాజిటర్లకూ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. హైకోర్టు అనుమతి రాగానే చెల్లింపులు చేపట్టాలని భావిస్తోంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారాన్ని చెల్లించేందుకు వీలుగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 1,150 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగానే తొలివిడతగా 264 కోట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే 10వేల లోపు డిపాజిటర్ల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు.

జిల్లాల వారీగా అగ్రిగోల్డ్​ బాధితులకు చెల్లింపులు
జిల్లా చిన్న డిపాజిటర్లు చెల్లింపులు (రూ.లలో)
గుంటూరు 19,751 14,09,41,615
చిత్తూరు 8,257 5,81,17,100
తూర్పుగోదావరి జిల్లా 19,545 11,46,87,619
పశ్చిమ గోదావరి 35,496 23,05,98,695
విజయనగరం జిల్లా 57,941 36,97,96,900
శ్రీకాకుళం 45,833 31,41,59,741
కర్నూలు 15,705 11,14,83,494
నెల్లూరు 24,390 16,91,74,466
కృష్ణాజిల్లా 21,444 15,04,77,760
అనంతపురం 23,838 20,64,21,009
కడప జిల్లా 18,864 13,18,06,875
ప్రకాశంజిల్లా 26,586 19,11,50,904
విశాఖ జిల్లా 52,005 45,10,85,805
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.