ETV Bharat / state

డెల్టాలో తొలి కరోనా పాజిటివ్​.. అప్రమత్తమైన అధికారులు - డెల్టాలో తొలి కరోనా పాజిటీవ్​.. అప్రమత్తమైన అధికారులు

గుంటూరు జిల్లా డెల్టాలోని కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు స్థానిక అధికారులు తెలియజేశారు. బాపట్ల నియోజకవర్గంలో ఇది తొలి కేసు. ఈ కారణంగా.. కర్లపాలెం మండలంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

first case registerd in guntur dst delta
డెల్టాలో తొలి కరోనా పాజిటీవ్​.. అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : Apr 15, 2020, 7:15 PM IST

గుంటూరు జిల్లా తీరప్రాంతమైన డెల్టాలో తొలి కరోనా కేసు నిర్థరణ అయింది. దుండివారిపాలెం పంచాయతీకి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ఇతను కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒక వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. తగ్గకపోవడంతో ఈ నెల 11న గుంటూరు వెళ్ళాడు. అక్కడ అతన్ని పరీక్షించి క్వారంటైన్​​కు తరలించారు. వైద్య పరీక్షలో పాజిటివ్​గా తేలగా.. జిల్లా అధికారులు మండల అధికారులను అప్రమత్తం చేశారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లా తీరప్రాంతమైన డెల్టాలో తొలి కరోనా కేసు నిర్థరణ అయింది. దుండివారిపాలెం పంచాయతీకి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ఇతను కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒక వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. తగ్గకపోవడంతో ఈ నెల 11న గుంటూరు వెళ్ళాడు. అక్కడ అతన్ని పరీక్షించి క్వారంటైన్​​కు తరలించారు. వైద్య పరీక్షలో పాజిటివ్​గా తేలగా.. జిల్లా అధికారులు మండల అధికారులను అప్రమత్తం చేశారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఇదీ చూడండి:

కరోనాను దాచిపెడితే దావానలంలా వ్యాపిస్తుంది: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.