ETV Bharat / state

భయపెడుతున్న బాణసంచా ధరలు.. తప్పడం లేదంటున్న కొనుగోలుదారులు..

author img

By

Published : Oct 24, 2022, 6:03 PM IST

Fire Crackers: దీపావళి పండగ మొదలైన బాణసంచా దుకాణాల వద్ద ఆ సందడి కనపడటం లేదు. పెరిగిన ధరల వల్ల ప్రజలు బాణసంచా కొనడానికి ఆసక్తి చూపకపోవటంతో బాణసంచా దుకాణాలు వెలవెల బోతున్నాయి. గత సంవత్సరం ఉన్న ధరల కన్నా ఈ సంవత్సరం ధరలు అధికంగా ఉండటమే..దీనికి కారణం. మరోవైపు పట్టణ ప్రాంతాలలో ధరలు పెరిగిన కూడా బాణసంచా క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి.

Etv Bharat
Etv Bharat

Fire Crackers: గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు దీపావళి పండగను పెద్దగా జరుపుకోలేదు. ఈ సంవత్సరమైన ఘనంగా జరుపుకోవాలి అనుకునే ప్రజలకు బాణసంచా ధరలు.. పంటి కింద రాయిలాగా మారాయి. దీపావళి పండగ అంటే బాణసంచా సాధరణం. గత రెండు సంవత్సరాలుగా పండగ లేకపోవటంతో టపాకాయల క్రయవిక్రయాలు జరగలేదు. ఈ సంవత్సరమైనా వ్యాపారం బాగుటుందని ఆశించిన వ్యాపారులకు.. నిరాశే ఎదురైంది. గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. సరదాగా జరుపుకుందామనుకున్న పండుగ వేళ టపాకాయల ధరలు కొండెక్కడంతో.. బాణసంచా కొనలేకపోతున్నమని ప్రజలు అంటున్నారు.

కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలకు వచ్చిన ప్రజలు.. పెరిగిన ధరలను చూసి హడలెత్తుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా పండగను జరుపుకోలేకపోయామని, ఈ సంవత్సరం జరుపుకుందమనుకుంటే ధరలు వీపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగటం వల్ల బాణసంచా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వం బాణాసంచా ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోకపోవటం వలనే.. వ్యాపారులు ఇష్టంవచ్చిన ధరలకు అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు.

అనంతపురంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా బాణసంచా స్టాల్స్​ ఏర్పాటు చేశారు. బాణసంచా కొనుగోలుకు వచ్చిన ప్రజలు ధరలను చూసి ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. గతంలో కంటే ధరలు అధికంగా పెరిగాయని.. ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం చూపుతోందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాల్లో సుమారు వెయ్యికి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. కావలి, కందుకూరు, ఆత్మకూరు పట్టణాల్లో ప్రత్యేకంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. క్రయ విక్రయాలు ధరలు పెరిగిన కూడా జోరందుకున్నాయి. ధరలు పెరిగిన కూడా కొనుగోలుదారులు ఆ భారాన్ని భరించుకుని బాణసంచా కొనుగొలు చేస్తున్నారు. దీపావళి పండగ అంటేనే బాణసంచా ప్రత్యేకమని.. అందుకు తప్పటం లేదని ప్రజలు అంటున్నారు. జిల్లా పోలీసుల ప్రత్యేక భద్రత నడుమ బాణసంచా స్టాల్స్​ను నిర్వహిస్తున్నారు.

పెరిగిన బాణసంచా ధరలు

ఇవీ చదవండి:

Fire Crackers: గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు దీపావళి పండగను పెద్దగా జరుపుకోలేదు. ఈ సంవత్సరమైన ఘనంగా జరుపుకోవాలి అనుకునే ప్రజలకు బాణసంచా ధరలు.. పంటి కింద రాయిలాగా మారాయి. దీపావళి పండగ అంటే బాణసంచా సాధరణం. గత రెండు సంవత్సరాలుగా పండగ లేకపోవటంతో టపాకాయల క్రయవిక్రయాలు జరగలేదు. ఈ సంవత్సరమైనా వ్యాపారం బాగుటుందని ఆశించిన వ్యాపారులకు.. నిరాశే ఎదురైంది. గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. సరదాగా జరుపుకుందామనుకున్న పండుగ వేళ టపాకాయల ధరలు కొండెక్కడంతో.. బాణసంచా కొనలేకపోతున్నమని ప్రజలు అంటున్నారు.

కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలకు వచ్చిన ప్రజలు.. పెరిగిన ధరలను చూసి హడలెత్తుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా పండగను జరుపుకోలేకపోయామని, ఈ సంవత్సరం జరుపుకుందమనుకుంటే ధరలు వీపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగటం వల్ల బాణసంచా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వం బాణాసంచా ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోకపోవటం వలనే.. వ్యాపారులు ఇష్టంవచ్చిన ధరలకు అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు.

అనంతపురంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా బాణసంచా స్టాల్స్​ ఏర్పాటు చేశారు. బాణసంచా కొనుగోలుకు వచ్చిన ప్రజలు ధరలను చూసి ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. గతంలో కంటే ధరలు అధికంగా పెరిగాయని.. ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం చూపుతోందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాల్లో సుమారు వెయ్యికి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. కావలి, కందుకూరు, ఆత్మకూరు పట్టణాల్లో ప్రత్యేకంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. క్రయ విక్రయాలు ధరలు పెరిగిన కూడా జోరందుకున్నాయి. ధరలు పెరిగిన కూడా కొనుగోలుదారులు ఆ భారాన్ని భరించుకుని బాణసంచా కొనుగొలు చేస్తున్నారు. దీపావళి పండగ అంటేనే బాణసంచా ప్రత్యేకమని.. అందుకు తప్పటం లేదని ప్రజలు అంటున్నారు. జిల్లా పోలీసుల ప్రత్యేక భద్రత నడుమ బాణసంచా స్టాల్స్​ను నిర్వహిస్తున్నారు.

పెరిగిన బాణసంచా ధరలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.