ETV Bharat / state

కుమార్తెను వేధిస్తున్న అల్లుడు..మామ ఏం చేశాడంటే..!

తన కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడని.. అతనిపై మామ, బావమరిది వేటకొడవలితో దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. ఎన్నిసార్లు సర్దిచెప్పినా.. పద్ధతి మార్చుకోకపోవటంతో ఈ చర్యకు పాల్పడినట్లు వారు తెలిపారు.

author img

By

Published : Oct 9, 2021, 6:30 PM IST

father in law attacks on son in law at piduguralla in guntur
అల్లుడిపై దాడికి పాల్పడ్డ మామ

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో దారుణం జరిగింది. తన కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడని.. అతనిపై మామ, బావమరిది వేటకొడవలితో దాడికి పాల్పడ్డారు. దైద గ్రామానికి చెందిన దూదేకుల చిన్న ఖాసీంకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం.. అత్తారింటికి ఇల్లరికం వెళ్లిన ఖాసీం చెడు వ్యసనాలకు బానిసై నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. ఎన్నిసార్లు సర్దిచెప్పినా..పద్ధతి మార్చుకోకపోవటంతో చిన్న ఖాసీంను అతని మామ పలుసార్లు నిలదీశారు. శుక్రవారం రాత్రి పూటుగా తాగివచ్చిన ఖాసీం.. భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఖాసీంను, అతని మామ పీరుసాహెబ్బా మందలించారు. ఘర్షణలో చిన్న ఖాసీంపై పీరుసాహెబ్బా, బావమరిది శీనుభాషాలు.. దాడి చేయగా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వటంతో.. ఖాసీంను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్​లో ఇరు కుటుంబాలు రాజీ చేసుకుని.. కేసు వెనక్కి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో దారుణం జరిగింది. తన కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడని.. అతనిపై మామ, బావమరిది వేటకొడవలితో దాడికి పాల్పడ్డారు. దైద గ్రామానికి చెందిన దూదేకుల చిన్న ఖాసీంకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం.. అత్తారింటికి ఇల్లరికం వెళ్లిన ఖాసీం చెడు వ్యసనాలకు బానిసై నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. ఎన్నిసార్లు సర్దిచెప్పినా..పద్ధతి మార్చుకోకపోవటంతో చిన్న ఖాసీంను అతని మామ పలుసార్లు నిలదీశారు. శుక్రవారం రాత్రి పూటుగా తాగివచ్చిన ఖాసీం.. భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఖాసీంను, అతని మామ పీరుసాహెబ్బా మందలించారు. ఘర్షణలో చిన్న ఖాసీంపై పీరుసాహెబ్బా, బావమరిది శీనుభాషాలు.. దాడి చేయగా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వటంతో.. ఖాసీంను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్​లో ఇరు కుటుంబాలు రాజీ చేసుకుని.. కేసు వెనక్కి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

E-BID ‘FRAUD': రూ.300 కోట్ల ఈ-బిడ్ కుంభకోణం.. మహిళ అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.