ETV Bharat / state

'గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టుకు ఒక్క గజం కూడా ఇవ్వం' - అమరావతి రైతులు

గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు భూమి ఇచ్చేది లేదని వైకుంఠపురం రైతులు తేల్చి చెప్పారు. అమరావతి మండలం వైకుంఠపురంలో రైతులతో రెవెన్యూ అధికారులు సభ ఏర్పాటు చేశారు. భూసేకరణపై రైతులతో చర్చించగా...ఒక్క గజం భూమి కూడా ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. గతంలో భూమిలిచ్చిన వారు రోడ్డున పడ్డారని...అది చూసిన తర్వాత తాము ఎలా ఇస్తామని అధికారులతో ఉద్ఘాటించారు.

గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు ఒక్క గజం కూడా ఇవ్వం
గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు ఒక్క గజం కూడా ఇవ్వం
author img

By

Published : Sep 21, 2020, 7:31 PM IST

గుంటూరు జిల్లాలో గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రయత్నాల్లో రెవెన్యూ అధికారులకు మరోసారి చుక్కెదురైంది. అమరావతి మండలం వైకుంఠపురంలో భూసేకరణ అంశంపై రైతులతో చర్చించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారుల ఎదుట రైతులు తమ అభ్యంతరాలను వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. గ్రామసభ పేరుతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలో 80 శాతం రైతులు అంగీకారం తెలిపితేనే భూసేకరణ చేయాలని... లేకుంటే నిలిపివేయాలని కోరారు. భూములు ఇచ్చేది లేదని రైతులు తీర్మానించి రెవెన్యూ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేశారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చి అవస్థలు పడుతున్న రైతుల ఉదంతాన్ని గుర్తు చేశారు.

గుంటూరు జిల్లాలో గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రయత్నాల్లో రెవెన్యూ అధికారులకు మరోసారి చుక్కెదురైంది. అమరావతి మండలం వైకుంఠపురంలో భూసేకరణ అంశంపై రైతులతో చర్చించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారుల ఎదుట రైతులు తమ అభ్యంతరాలను వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. గ్రామసభ పేరుతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలో 80 శాతం రైతులు అంగీకారం తెలిపితేనే భూసేకరణ చేయాలని... లేకుంటే నిలిపివేయాలని కోరారు. భూములు ఇచ్చేది లేదని రైతులు తీర్మానించి రెవెన్యూ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేశారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చి అవస్థలు పడుతున్న రైతుల ఉదంతాన్ని గుర్తు చేశారు.

ఇదీచదవండి

'అమరావతిని తరలించేందుకు కుట్ర జరుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.