ETV Bharat / state

రైతన్న ఆలోచన అదిరింది... పంట ఒడ్డుకు చేరింది

author img

By

Published : Oct 18, 2020, 3:30 PM IST

పండించిన పంట నీటి పాలు కాకుండా ఓ రైతు వినూత్న ఆలోచన చేశారు. అనుకోని పరిస్థితిని సైతం తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి పంటను కాపాడుకున్నారు.

banana farmer innovative idea
banana farmer innovative idea
రైతన్న ఆలోచన అదిరింది... పంట ఒడ్డుకు చేరింది!

రహదారికి కిలోమీటరు దూరంలో ఉన్న అరటి తోటలో మోకాలు లోతు నీరు. పండిన పంటను బయటకు తీసుకురావడానికి కూలీ తడిసి మోపెడవుతోంది. దీనికి తోడు తోట వెంట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన రైతు నగేష్‌ ఓ వినూత్న ఆలోచన చేశారు.

తోటలో కోసిన సుమారు 60 అరటి గెలలను తోరణాల్లా తాడుకు కట్టారు. దానిని పట్టుకుని వరద ప్రవాహంలో వాలు వైపు అరటి డొప్పపై తేలియాడుతూ కిలోమీటరు మేర మరొకరి సాయంతో తీసుకొచ్చి ఒడ్డుకు, అక్కడ నుంచి రోడ్డుకు చేర్చారు. దీంతో గెలకు 25 రూపాయలు చొప్పున అయ్యే కూలీతోపాటు రవాణా ఛార్జీలు కలిసొచ్చాయి.

ఇదీ చదవండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

రైతన్న ఆలోచన అదిరింది... పంట ఒడ్డుకు చేరింది!

రహదారికి కిలోమీటరు దూరంలో ఉన్న అరటి తోటలో మోకాలు లోతు నీరు. పండిన పంటను బయటకు తీసుకురావడానికి కూలీ తడిసి మోపెడవుతోంది. దీనికి తోడు తోట వెంట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన రైతు నగేష్‌ ఓ వినూత్న ఆలోచన చేశారు.

తోటలో కోసిన సుమారు 60 అరటి గెలలను తోరణాల్లా తాడుకు కట్టారు. దానిని పట్టుకుని వరద ప్రవాహంలో వాలు వైపు అరటి డొప్పపై తేలియాడుతూ కిలోమీటరు మేర మరొకరి సాయంతో తీసుకొచ్చి ఒడ్డుకు, అక్కడ నుంచి రోడ్డుకు చేర్చారు. దీంతో గెలకు 25 రూపాయలు చొప్పున అయ్యే కూలీతోపాటు రవాణా ఛార్జీలు కలిసొచ్చాయి.

ఇదీ చదవండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.