మద్యం తాగి ఉన్న డ్రైవర్ను పోలీసు స్టేషన్కు తరలించారన్న కోపంతో ట్రాక్టర్లో ఉన్న వారు పోలీసు స్టేషన్ ముందు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు జిల్లా శ్యావల్యాపురం మండలంలోని కారుమంచికి చెందిన పలువురు దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని నిదానంపాటి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో పోలీసులు.. ట్రాక్టర్ను అడ్డుకున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడన్న కారణంతో పోలీసు స్టేషన్కు తరలించారు.
స్టేషన్ ఎదుట ఆందోళన.. లాఠీఛార్జ్
డ్రైవర్ను అరెస్ట్ చేయడంతో.. ట్రాక్టర్లో ఉన్నవారు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి.. అక్కడ్డున్న వారిని చెదరగొట్టారు. నిబంధనలను ఉల్లంఘించినందుకే అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Theft: తాడేపల్లిలో చోరీ.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ