ETV Bharat / state

వివాహిత ఆత్మహత్య.. అత్తింటివారు అరెస్టు - women suicide in guntur news

వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరులో జరిగింది. మహిళ మృతికి కారణమైన అత్తింటి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

accused arrest
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Feb 27, 2021, 7:46 AM IST

అత్తింటి వారు వరకట్నం కోసం వేధింపులకు గురి చేయటంతో శ్రావణి అనే వివాహిత బలవర్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు కారణమైన భర్త, అతని కుటుంబసభ్యులను అరెస్ట్​ చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజ తెలిపారు.

ఏం జరిగింది?

గుంటూరు రాజీవ్​గాంధీ నగర్​కి చెందిన పసుపులేటి శివప్రసాద్​తో శ్రావణి అనే మహిళకు 2016లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో శ్రావణి తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు, బంగారపు ఉంగరం ఇతర లాంఛనాలు శివప్రసాద్​కి కట్నంగా ఇచ్చారు. భర్త, అత్త, మామ అదనపు కట్నం కావాలని శ్రావణిని మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. కూతురి కాపురం బాగుండాలని శ్రావణి తల్లిదండ్రులు మరో రెండుసార్లు రూ.40వేలు చొప్పున శివప్రసాద్​కి ఇచ్చారు. అయినా వేధింపులు ఆపని కారణంగా మనోవేదనకు గురైన శ్రావణి.. ఈ నెల 23న తన ఇంటిలోనే చీరతో ఉరి వేసుకుని మరణించింది.

మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు అరండల్ పేట పోలీసులు తెలిపారు. శ్రావణి చావుకు కారణమైన భర్త శివ ప్రసాద్, అతని తల్లి ఆది లక్ష్మి, కుటుంబసభ్యురాలు నాగమణిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ సుప్రజ వివరించారు.

ఇదీ చదవండి:

రేబాల వద్ద బస్సు-ఆటో ఢీ.. ఒకరు మృతి

అత్తింటి వారు వరకట్నం కోసం వేధింపులకు గురి చేయటంతో శ్రావణి అనే వివాహిత బలవర్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు కారణమైన భర్త, అతని కుటుంబసభ్యులను అరెస్ట్​ చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజ తెలిపారు.

ఏం జరిగింది?

గుంటూరు రాజీవ్​గాంధీ నగర్​కి చెందిన పసుపులేటి శివప్రసాద్​తో శ్రావణి అనే మహిళకు 2016లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో శ్రావణి తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు, బంగారపు ఉంగరం ఇతర లాంఛనాలు శివప్రసాద్​కి కట్నంగా ఇచ్చారు. భర్త, అత్త, మామ అదనపు కట్నం కావాలని శ్రావణిని మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. కూతురి కాపురం బాగుండాలని శ్రావణి తల్లిదండ్రులు మరో రెండుసార్లు రూ.40వేలు చొప్పున శివప్రసాద్​కి ఇచ్చారు. అయినా వేధింపులు ఆపని కారణంగా మనోవేదనకు గురైన శ్రావణి.. ఈ నెల 23న తన ఇంటిలోనే చీరతో ఉరి వేసుకుని మరణించింది.

మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు అరండల్ పేట పోలీసులు తెలిపారు. శ్రావణి చావుకు కారణమైన భర్త శివ ప్రసాద్, అతని తల్లి ఆది లక్ష్మి, కుటుంబసభ్యురాలు నాగమణిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ సుప్రజ వివరించారు.

ఇదీ చదవండి:

రేబాల వద్ద బస్సు-ఆటో ఢీ.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.