గంటల తరబడి క్యూలో నిలుచున్నా... మద్యం దొరకడంలేదని మందుబాబులు తల్లడిపోతున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ వైన్స్ ముందు... మద్యం కోసం ఇలా బారులు తీరారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కష్టాలు పెరిగాయని మందుబాబులు వాపోతున్నారు. దానికితోడు బార్లు, రెస్టారెంట్లలో అధిక ధరలకు విక్రయించడం కారణంగా... మద్యం ప్రియులు తల్లడిపోతున్నారు. ఎక్కడ వైన్ షాప్ కనిపిస్తుందా... ఎక్కడ మద్యం దొరుకుతుందా అంటూ వెతుకుతున్నారు. ఎక్కడైనా మందు దుకాణం కనిపిస్తే అక్కడ గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ: