గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమ పట్నం నుంచి కోటప్ప కొండకు రెండు రోజుల ముందుగానే ప్రభలు బయలుదేరాయి. భక్తుల నినాదాల మధ్య మొత్తం పది ప్రభలు.. కోటప్పకొండకు బయలుదేరాయి. ఈనెల 10న ఎన్నికలు ఉండడంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే విడదల రజినీ ప్రభను నడిపారు. కోటప్పకొండ తిరునాళ్ల రోజున భక్తులందరూ.. పోలీసులు రూపొందించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం