ETV Bharat / state

బ్రాంచ్ కెనాల్​లో పడి పశుసంవర్ధకశాఖ ఏడీఏ గల్లంతు... గాలింపు చేపట్టిన పోలీసులు

గుంటూరు జిల్లా నకరికల్లులోని గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో పడి పశుసంవర్ధకశాఖ ఏడీఏ కొలగాని ఏడుకొండలు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏడుకొండలు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

author img

By

Published : Mar 8, 2021, 1:40 AM IST

Updated : Mar 8, 2021, 4:30 AM IST

yedukondalu missing in a guntur Branch Canal
బ్రాంచ్ కెనాల్​లో వ్యక్తి గల్లంతు

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం అడ్డరోడ్డులోని గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో ప్రమాదవశాత్తు పడి ఓ అధికారి గల్లంతయ్యారు. రొంపిచర్ల మండలం ఎడ్వర్టు పేటకు చెందిన కొలగాని ఏడుకొండలు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చదలవాడలోని సీబీఎఫ్​లో పశుసంవర్ధకశాఖ ఏడీఏగా పనిచేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఏడుకొండలు ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో పడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నకరికల్లు పోలీసులు.. స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టగా.. అతనికి చెందిన ద్విచక్ర వాహనం, ఓ టవాలు మాత్రమే దొరికాయి. ఏడుకొండలు కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

ఇదీచూడండి:

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం అడ్డరోడ్డులోని గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో ప్రమాదవశాత్తు పడి ఓ అధికారి గల్లంతయ్యారు. రొంపిచర్ల మండలం ఎడ్వర్టు పేటకు చెందిన కొలగాని ఏడుకొండలు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చదలవాడలోని సీబీఎఫ్​లో పశుసంవర్ధకశాఖ ఏడీఏగా పనిచేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఏడుకొండలు ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో పడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నకరికల్లు పోలీసులు.. స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టగా.. అతనికి చెందిన ద్విచక్ర వాహనం, ఓ టవాలు మాత్రమే దొరికాయి. ఏడుకొండలు కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

ఇదీచూడండి:

ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!

Last Updated : Mar 8, 2021, 4:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.