గుంటూరు జిల్లా గంగిరెడ్డిపాలెంలో ఓ జింకను కుక్కలు వేటాడి చంపాయి. ఓ జింక నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి ఊర్లోకి వచ్చింది. జింకను చూసిన కుక్కలు వెంటాడి.. వేటాడి చంపాయని గ్రామస్థులు తెలిపారు. అటవీ ప్రాంతంలో లోతైన కాలువల వల్ల కొంతమందికి వేట సులువైందని...అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అడవుల్లో వన్యప్రాణులకు నీటి గుంతలు తీయకపోవటం వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు జంతువులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి-గుంటూరులో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం