ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 491 మందికి కరోనా

గుంటూరు జిల్లాలో శనివారం కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 57, 380 కరోనా కేసులు నమోదు కాగా... 540 మంది మృతి చెందారు.

author img

By

Published : Oct 3, 2020, 9:26 PM IST

జిల్లాలో కొత్తగా కరోనా 491 కేసులు
జిల్లాలో కొత్తగా కరోనా 491 కేసులు

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57,380కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 81 ఉన్నాయి. చిలకలూరిపేటలో 46, తాడేపల్లి 43, రేపల్లె 38, పెదనందిపాడు 33, నాదెండ్ల 27, పొన్నూరు 22, నరసరావుపేట 20, రొంపిచర్ల 20 , యడ్లపాడు 10, మంగళగిరి 10, మేడికొండూరు10, తాడికొండ 10, ముప్పాళ్లలో10 కేసుల చొప్పున నమోదయ్యాయి.

జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 50 వేల 385 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో శనివారం నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 540కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57,380కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 81 ఉన్నాయి. చిలకలూరిపేటలో 46, తాడేపల్లి 43, రేపల్లె 38, పెదనందిపాడు 33, నాదెండ్ల 27, పొన్నూరు 22, నరసరావుపేట 20, రొంపిచర్ల 20 , యడ్లపాడు 10, మంగళగిరి 10, మేడికొండూరు10, తాడికొండ 10, ముప్పాళ్లలో10 కేసుల చొప్పున నమోదయ్యాయి.

జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 50 వేల 385 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో శనివారం నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 540కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 6,224 కరోనా కేసులు.. 41 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.