ETV Bharat / state

కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా 164 కేసులు

author img

By

Published : Nov 23, 2020, 6:20 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 164 కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,061కు చేరింది.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు
corona cases in guntur district

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 164 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 72వేల 61 కేసులకు చేరింది. తాజా కేసుల్లో.. అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 33 మందికి కోవిడ్ సోకింది. బాపట్ల, మంగళగిరి నుంచి 12 కేసుల చొప్పున, అమరావతి మండలంలో 11 కేసులు బయటపడ్డాయి.

మొత్తంగా.. జిల్లాలో 69వేల 809 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావంతో ఒకరు మరణించగా... జిల్లాలో కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందినవారి సంఖ్య 644కి పెరిగింది. కరోనాతో అత్యధికంగా మృతి చెందినవారి సంఖ్యలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 164 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 72వేల 61 కేసులకు చేరింది. తాజా కేసుల్లో.. అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 33 మందికి కోవిడ్ సోకింది. బాపట్ల, మంగళగిరి నుంచి 12 కేసుల చొప్పున, అమరావతి మండలంలో 11 కేసులు బయటపడ్డాయి.

మొత్తంగా.. జిల్లాలో 69వేల 809 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావంతో ఒకరు మరణించగా... జిల్లాలో కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందినవారి సంఖ్య 644కి పెరిగింది. కరోనాతో అత్యధికంగా మృతి చెందినవారి సంఖ్యలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

కర్నూలులో విమానాల మరమ్మతు కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.