ETV Bharat / state

పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం - సీఎం జగన్ తాజా వార్తలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా.. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తెను సీఎం జగన్ సన్మానించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని ఆమె నివాసానికి వెళ్లిన జగన్.. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని ఘనంగా సన్మానించారు. జాతీయ పతాకం రూపొందించి ఈ ఏడాది మార్చి 31కు వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఆమెను సత్కరించారు. సీతామహాలక్ష్మిని సీఎం జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను జగన్ తిలకించారు.

CM Jagan honors Pingali Venkaiah's daughter
పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం
author img

By

Published : Mar 12, 2021, 1:01 PM IST

Updated : Mar 12, 2021, 6:09 PM IST

జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సన్మానించారు. త్రివర్ణ పతాకానికి ఈ నెల 31తో వందేళ్లు కావస్తున్న సందర్భంగా.. జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్యను సీఎం గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి, ఆమె మనవడు నరసింహం ఇంటికి సీఎం వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేశం గర్వపడే జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య జీవిత విశేషాలను కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు.

పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం

99 సంవత్సరాల వయసు ఉన్న సీతామహాలక్ష్మిని సీఎం పలకరించి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. 75 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రొసీడింగ్స్​ను సీఎం చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులతో సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. మీడియా ప్రతినిధులను ఎవరిని అనుమతించలేదు. సీఎం జగన్ తమ ఇంటికి రావడం పట్ల పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి, మనవడు నరసింహం హర్షం వ్యక్తం చేశారు. తన మనవడే ఇంటికి వచ్చినట్లు ఉందని 99 ఏళ్ల సీతామహాలక్ష్మి వ్యాఖ్యానించారు.

పింగళి వెంకయ్యకు భారతరత్న అవార్డుపై సీతామహాలక్ష్మి స్పందిస్తూ... తన తండ్రికి భారతరత్న వస్తే సంతోషమేనని.. తాను ఉండగానే అది అందుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుందని అన్నారు. పింగళి తెలువాడైనందుకు గర్వపడాలా.. రావాల్సినంత గుర్తింపు రాలేదని బాధపడాలో తెలియడం లేదని మనవడు నరసింహం తెలిపారు. సీతామహాలక్ష్మిని సత్కరించడం అంటే వెంకయ్యగారిని సత్కరించడమేనని అన్నారు. జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడటం ద్వారా పింగళి వెంకయ్యకు అసలైన నివాళి అని నరసింహం అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'

జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సన్మానించారు. త్రివర్ణ పతాకానికి ఈ నెల 31తో వందేళ్లు కావస్తున్న సందర్భంగా.. జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్యను సీఎం గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి, ఆమె మనవడు నరసింహం ఇంటికి సీఎం వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేశం గర్వపడే జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య జీవిత విశేషాలను కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు.

పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం

99 సంవత్సరాల వయసు ఉన్న సీతామహాలక్ష్మిని సీఎం పలకరించి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. 75 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రొసీడింగ్స్​ను సీఎం చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులతో సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. మీడియా ప్రతినిధులను ఎవరిని అనుమతించలేదు. సీఎం జగన్ తమ ఇంటికి రావడం పట్ల పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి, మనవడు నరసింహం హర్షం వ్యక్తం చేశారు. తన మనవడే ఇంటికి వచ్చినట్లు ఉందని 99 ఏళ్ల సీతామహాలక్ష్మి వ్యాఖ్యానించారు.

పింగళి వెంకయ్యకు భారతరత్న అవార్డుపై సీతామహాలక్ష్మి స్పందిస్తూ... తన తండ్రికి భారతరత్న వస్తే సంతోషమేనని.. తాను ఉండగానే అది అందుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుందని అన్నారు. పింగళి తెలువాడైనందుకు గర్వపడాలా.. రావాల్సినంత గుర్తింపు రాలేదని బాధపడాలో తెలియడం లేదని మనవడు నరసింహం తెలిపారు. సీతామహాలక్ష్మిని సత్కరించడం అంటే వెంకయ్యగారిని సత్కరించడమేనని అన్నారు. జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడటం ద్వారా పింగళి వెంకయ్యకు అసలైన నివాళి అని నరసింహం అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'

Last Updated : Mar 12, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.