ETV Bharat / state

నేనే వస్తున్నా..బాధితుల్లో భరోసా నింపుతా: చంద్రబాబు

వైకాపా దాడులు అవాస్తవమైతే...గుంటూరు పునరావాస శిబిరంలో ఉన్నది వైకాపా నేతలా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. బాధితులకు భరోసానిచ్చేందుకు ఆత్మకూరులో పర్యటిస్తానని ఆయన ప్రకటించారు.

author img

By

Published : Sep 9, 2019, 5:08 PM IST

దాడులు అవాస్తవమైతే... శిబిరంలో ఉన్నది వైకాపా నేతలా? : చంద్రబాబు


వైకాపా దాడులు నిజం కాకపోతే... బాధితులు గ్రామాలు వదిలేసి గుంటూరు పునరావాస శిబిరంలో ఎందుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పల్నాడు గ్రామాల్లో బోసిపోయిన ఇళ్లు, బీడు పడ్డ భూములు... అన్నీ పుకార్లు అయితే పునరావాస శిబిరంలో ఉన్నది వైకాపా నేతలా అని చంద్రబాబు నిలదీశారు. బాధితులు సొంతూర్లను వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవడం ఎందుకన్నారు. కళ్లెదుట కనిపించే నిజాలను వైకాపా నేతలు చూడలేకపోతున్నారని విమర్శించారు. బాధితుల కన్నీళ్లెందుకు తుడవలేకపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. బాధితుల్లో భరోసానిచ్చేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాధితుల హక్కుల కోసం ఆత్మకూరులో పర్యటిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు బాధితులకు సంఘీభావంగా కదిలిరావాలని పిలుపునిచ్చారు.

దాడులు అవాస్తవమైతే... శిబిరంలో ఉన్నది వైకాపా నేతలా? : చంద్రబాబు

ఇదీ చదవండి : 11న ఛలో ఆత్మకూరుతో.. వైకాపా బాధితుల్లో ధైర్యం పెంచుతాం


వైకాపా దాడులు నిజం కాకపోతే... బాధితులు గ్రామాలు వదిలేసి గుంటూరు పునరావాస శిబిరంలో ఎందుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పల్నాడు గ్రామాల్లో బోసిపోయిన ఇళ్లు, బీడు పడ్డ భూములు... అన్నీ పుకార్లు అయితే పునరావాస శిబిరంలో ఉన్నది వైకాపా నేతలా అని చంద్రబాబు నిలదీశారు. బాధితులు సొంతూర్లను వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవడం ఎందుకన్నారు. కళ్లెదుట కనిపించే నిజాలను వైకాపా నేతలు చూడలేకపోతున్నారని విమర్శించారు. బాధితుల కన్నీళ్లెందుకు తుడవలేకపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. బాధితుల్లో భరోసానిచ్చేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాధితుల హక్కుల కోసం ఆత్మకూరులో పర్యటిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు బాధితులకు సంఘీభావంగా కదిలిరావాలని పిలుపునిచ్చారు.

దాడులు అవాస్తవమైతే... శిబిరంలో ఉన్నది వైకాపా నేతలా? : చంద్రబాబు

ఇదీ చదవండి : 11న ఛలో ఆత్మకూరుతో.. వైకాపా బాధితుల్లో ధైర్యం పెంచుతాం

Intro:Ap_Nlr_02_09_Rottela_Panduga_Minister_Parisilana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. స్వర్ణాల చెరువు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. రొట్టెల పండుగకు గత ఏడాదితో పోలిస్తే తక్కువ ఖర్చుతో నాణ్యతగా పనులు చేశామన్నారు. హోంం మినిస్టర్ సుచరిత, పలువురు మంత్రులు, ఈ పండగకు వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. పారిశుద్ధ్యం తోపాటు చెరువులో నీళ్ళు పరిశుభ్రంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.