అమరావతి కోసం తుళ్లూరులో మహిళల భారీ ర్యాలీ - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో రైతులు, మహిళలు.... కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రైతులు, మహిళలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో మారు మోగించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.