ETV Bharat / state

Nagarjunakonda: నాగార్జున కొండకు లాంచీ ప్రయాణాల పునరుద్ధరణ

author img

By

Published : Feb 19, 2022, 6:57 AM IST

Boat Journey to Nagarjunakonda: నాగార్జున కొండకు లాంచీ ప్రయాణాలకు పర్యాటక శాఖ అనుమతినిచ్చింది. నేటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. భద్రత, కొవిడ్ కారణాల వల్ల రెండున్నరేళ్లగా ప్రయాణాలు ఆగిపోయాయి.

launchy to nagarjuna konda
launchy to nagarjuna konda

Tourism: ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను తిలకించేందుకు ఇవాళ్టి నుంచి సందర్శకులకు అనుమతించనున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని నాగార్జున కొండకు సందర్శకుల లాంచీ ప్రయాణాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

రెండున్నరేళ్లుగా భద్రత కారణాలు, కరోనా వ్యాప్తి వల్ల కొండకు లాంచీలను నిలిపేశారు. పర్యాటక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నేటి నుంచి కొండకు ప్రయాణాలు చేపట్టనున్నట్లు... పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు నాగసిరి లాంచీ కొండకు పర్యాటకులను చేరవేసేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. నాగార్జున కొండకు వెళ్లేందుకు లాంచీ టికెట్టు ధరలను.. పెద్దలకు 150, పిల్లలకు 120 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. కొండకు లాంచీల పునరుద్ధరణతో పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Tourism: ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను తిలకించేందుకు ఇవాళ్టి నుంచి సందర్శకులకు అనుమతించనున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని నాగార్జున కొండకు సందర్శకుల లాంచీ ప్రయాణాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

రెండున్నరేళ్లుగా భద్రత కారణాలు, కరోనా వ్యాప్తి వల్ల కొండకు లాంచీలను నిలిపేశారు. పర్యాటక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నేటి నుంచి కొండకు ప్రయాణాలు చేపట్టనున్నట్లు... పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు నాగసిరి లాంచీ కొండకు పర్యాటకులను చేరవేసేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. నాగార్జున కొండకు వెళ్లేందుకు లాంచీ టికెట్టు ధరలను.. పెద్దలకు 150, పిల్లలకు 120 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. కొండకు లాంచీల పునరుద్ధరణతో పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి:

CM Jagan tour: ఆదివారం కడప, విశాఖలో సీఎం జగన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.