ETV Bharat / state

'పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం' - ap minister ranganadha raju latest press meet

రాష్ట్రంలో పేదలకు జులై 8న 30 లక్షల ఇళ్ల స్థలాలను ఇవ్వనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు చెప్పారు. పేదల సొంతింటి కలను నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. తొలి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహనిర్మాణాలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న రూ.1,223 కోట్ల బకాయిలను విడుదల చేశామని తెలిపారు.

'పేదల సొంతింటి కలను నెలవేర్చడమే ప్రభుత్వం లక్ష్యం'
'పేదల సొంతింటి కలను నెలవేర్చడమే ప్రభుత్వం లక్ష్యం'
author img

By

Published : Jun 11, 2020, 11:29 PM IST

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... జులై 8న రికార్డుస్థాయిలో 30 లక్షల ఇళ్లస్థలాలను ఒకేసారి అందించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు చెప్పారు. గుంటూరులో గృహ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై మంత్రులు మోపిదేవి, సుచరిత, ఉపసభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్న మంత్రి... తొలి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈలోపు పట్టాలిచ్చే స్థలాల్లో తాగునీరు, విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

ఇళ్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహనిర్మాణాలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న రూ.1,223 కోట్ల బకాయిలను విడుదల చేస్తున్నామని... అదే సమయంలో 17 వేల బోగస్ ఇళ్లను రద్దు చేసినట్లు మంత్రి చెప్పారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న ఆయన... కావాలని ఎవరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని... పార్టీ విధానాలు, చేసిన అభివృద్ధి చూసి వచ్చి చేరుతున్నారని స్పష్టం చేశారు.

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... జులై 8న రికార్డుస్థాయిలో 30 లక్షల ఇళ్లస్థలాలను ఒకేసారి అందించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు చెప్పారు. గుంటూరులో గృహ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై మంత్రులు మోపిదేవి, సుచరిత, ఉపసభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్న మంత్రి... తొలి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈలోపు పట్టాలిచ్చే స్థలాల్లో తాగునీరు, విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

ఇళ్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహనిర్మాణాలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న రూ.1,223 కోట్ల బకాయిలను విడుదల చేస్తున్నామని... అదే సమయంలో 17 వేల బోగస్ ఇళ్లను రద్దు చేసినట్లు మంత్రి చెప్పారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న ఆయన... కావాలని ఎవరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని... పార్టీ విధానాలు, చేసిన అభివృద్ధి చూసి వచ్చి చేరుతున్నారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 18న బడ్జెట్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.