ETV Bharat / state

"పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పు చూసైనా... ప్రభుత్వం దిగిరావాలి"

author img

By

Published : Jan 25, 2021, 7:17 PM IST

పంచాయతీ ఎన్నికల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చూసైనా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని రాజధాని అన్నదాతలు కోరారు. రాష్ట్రానికి ఓకే రాజధానిగా అమరావతే ఉండాలని... గుంటూరు జిల్లాలో రైతులు చేస్తున్న నిరసన 405వ రోజు కొనసాగింది. మూడు రాజధానులు వద్దు... ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.

farmers protest
రైతుల ఆందోళన

ఏకైక రాజధానిగా అమరావతే కావాలని ఆందోళన చేస్తున్న రైతుల దీక్ష 405వ రోజుకు చేరింది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు చూసైనా... జగన్ సర్కార్ దిగి రావాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం... భూములను త్యాగం చేశామని గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని... రాజధానిగా అమరావతిని ప్రకటించాలన్నారు.

ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు

ఏకైక రాజధానిగా అమరావతే కావాలని ఆందోళన చేస్తున్న రైతుల దీక్ష 405వ రోజుకు చేరింది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు చూసైనా... జగన్ సర్కార్ దిగి రావాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం... భూములను త్యాగం చేశామని గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని... రాజధానిగా అమరావతిని ప్రకటించాలన్నారు.

ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.