ETV Bharat / state

వైకాపా నేత తన పొలాన్ని ఆక్రమించాడంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం - The man attempted suicide news

గుంటూరు జిల్లా పెద్దకాకని రోడ్డులోని బీఎస్​ఎన్​ఎల్​ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి చేశాడు. మండల వైకాపా నేత తన పొలాన్ని ఆక్రమించాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

suicide attempt
సెల్​ టవర్​ ఎక్కిన వ్యక్తి
author img

By

Published : Jan 4, 2021, 2:01 PM IST

వైకాపా నేత తన పొలాన్ని ఆక్రమించాడని ఆరోపిస్తూ నల్లమోతు వెంకట శ్యామ్​కుమార్​ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు పెద్దకాకని రోడ్డులోని బీఎస్​ఎన్​ఎల్​ సెల్ టవర్ ఎక్కి దూకేందుకు ప్రయత్నించాడు.

సెల్​ టవర్​పై నుంచి సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న బాధితుడు

ఆత్మహత్యాయత్నానికి కారణం:

వైకాపా నేత నల్లమోతు శివరామకృష్ణ తన పొలాన్ని ఆక్రమించి.. అందులో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నాడని శ్యామ్​ ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసులకు, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శివరామకృష్ణ అధికార పార్టీ నేత అని అధికారులు భయపడుతున్నారని వాపోయాడు.

తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న తన పొలాన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని... దీన్ని అడ్డుకోవాలని వేడుకుంటున్నాడు. జీవనాధారమైన తన పొలాన్ని.. అధికారికంగా తనకు అప్పగించకపోతే ఆత్మహత్యే తప్ప వేరే దారిలేదని బోరుమంటున్నాడు. ప్రభుత్వమే బాధ్యత వహించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితుడి భార్య అతన్ని కిందకి దింపారు.

ఇదీ చదవండి: దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య

వైకాపా నేత తన పొలాన్ని ఆక్రమించాడని ఆరోపిస్తూ నల్లమోతు వెంకట శ్యామ్​కుమార్​ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు పెద్దకాకని రోడ్డులోని బీఎస్​ఎన్​ఎల్​ సెల్ టవర్ ఎక్కి దూకేందుకు ప్రయత్నించాడు.

సెల్​ టవర్​పై నుంచి సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న బాధితుడు

ఆత్మహత్యాయత్నానికి కారణం:

వైకాపా నేత నల్లమోతు శివరామకృష్ణ తన పొలాన్ని ఆక్రమించి.. అందులో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నాడని శ్యామ్​ ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసులకు, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శివరామకృష్ణ అధికార పార్టీ నేత అని అధికారులు భయపడుతున్నారని వాపోయాడు.

తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న తన పొలాన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని... దీన్ని అడ్డుకోవాలని వేడుకుంటున్నాడు. జీవనాధారమైన తన పొలాన్ని.. అధికారికంగా తనకు అప్పగించకపోతే ఆత్మహత్యే తప్ప వేరే దారిలేదని బోరుమంటున్నాడు. ప్రభుత్వమే బాధ్యత వహించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితుడి భార్య అతన్ని కిందకి దింపారు.

ఇదీ చదవండి: దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.