గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు 6 పాజిటివ్ కేసులు నమోదుకాగా.... మొత్తం కేసుల సంఖ్య 382కి పెరిగింది. తాజాగా గుంటూరులోని రామిరెడ్డితోట, చిన్నబజార్లో ఒక్కొక్కరికి కరోనా సోకింది. తాడేపల్లి, నరసరావుపేటలో రెండేసి కేసులు చొప్పున నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 373 కేసులు నమోదవగా... 176 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మరో 198 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాను జయించలేక 8 మంది మృతిచెందారు. కంటైన్మెంట్ జోన్లలోనే ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నమోదైన 6 పాజిటివ్ కేసులతో ఇప్పటివరకు నరసరావుపేటలో 165 కేసులు, గుంటూరులో 161 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: