రోగుల కష్టాలు తీరాయి. 108 అంబులెన్స్ల సిబ్బంది సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి జగన్ హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తక్షణం విధులకు హాజరవుతామని తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పిన 108 ఉద్యోగులు... ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 31లోగా వేతన బకాయిలు చెల్లించేందుకు అంగీకరించారు. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని తెలిపిన సీఎం... వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి...