ETV Bharat / state

పోటెత్తుతున్న వరద... నీట మునిగిన పంటలు - కృష్ణా నది ఉగ్రరూపం...100 ఎకరాల్లో పంటలు నష్టం

కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగటం వల్ల గుంటూరు జిల్లా చిర్రావూరులో 100 ఎకరాల్లోని పలు పంటలు నీట మునిగాయి. ఇవాళ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో...అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

కృష్ణా నది ఉగ్రరూపం...100 ఎకరాల్లో పంటలు నష్టం
author img

By

Published : Aug 14, 2019, 1:41 PM IST

కృష్ణా నది ఉగ్రరూపం...100 ఎకరాల్లో పంటలు నష్టం

కృష్ణానది ఉగ్రరూపంతో... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో దాదాపు 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మంగళవారం అర్ధరాత్రి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగటంతో మిరప, కంది అరటి తోటలు జలమయం అయ్యాయి. నీటి ప్రవాహాన్ని సీడబ్ల్యూసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాడేపల్లి మహానాడులో 8.3 మీటర్ల ఉన్న నీటి ప్రవాహం 11మీటర్లకు చేరితే ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇవాళ రాత్రికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో... ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీతానగరం ప్రాంతంలో శివాలయం నీట మునిగింది. కరకట్ట ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు రాకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరకట్ట దిగువన వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించారు. వరద పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: పులిచింతలకు జలకళ... దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం

కృష్ణా నది ఉగ్రరూపం...100 ఎకరాల్లో పంటలు నష్టం

కృష్ణానది ఉగ్రరూపంతో... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో దాదాపు 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మంగళవారం అర్ధరాత్రి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగటంతో మిరప, కంది అరటి తోటలు జలమయం అయ్యాయి. నీటి ప్రవాహాన్ని సీడబ్ల్యూసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాడేపల్లి మహానాడులో 8.3 మీటర్ల ఉన్న నీటి ప్రవాహం 11మీటర్లకు చేరితే ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇవాళ రాత్రికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో... ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీతానగరం ప్రాంతంలో శివాలయం నీట మునిగింది. కరకట్ట ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు రాకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరకట్ట దిగువన వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించారు. వరద పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: పులిచింతలకు జలకళ... దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం

Intro:ap_vzm_36_14_guntala_mayanga_rahadarulu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రహదారులు పాడయ్యాయి రోడ్డు వేసిన మూన్నాళ్ల కే రాళ్లు తేలడంతో వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో చిన్నపాటి వర్షాలకు ప్రధాన రహదారులు గోతులు మయంగా తయారయ్యాయి రోడ్డు వేసిన రెండేళ్లకే పాడవడం తో తో నాణ్యతపై ప్రజల పెదవి విరుస్తున్నారు పట్నంలోని నిత్యం రద్దీగా ఉండే బైపాస్ రోడ్డు పూర్తిగా పాడైంది కిలోమీటర్ పొడవున్న రోడ్డుపై అడుగడుగున గోతులు దర్శనమిస్తున్నాయి మలుపుల వద్ద అ పెద్ద గోతులు తయారవడంతో ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు బైపాస్ గూడ్స్ షెడ్ రోడ్డు తో పాటు పాత బస్టాండ్ వద్ద రహదారులు పాడయ్యాయి వర్షం పడితే గోతులు నీరు చేరి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తుంది సంబంధిత శాఖ చర్యలు త్వరగా చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు బైపాస్ రోడ్డులో ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుగుతున్నాయి రాత్రిపూట గోతిలో పడి వాహన చోదకులు ఆస్పత్రి పాలవుతున్నారు పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు


Conclusion:గోతులు మయంగా తయారైన బైపాస్ రోడ్డు గూడ్స్ షెడ్ రోడ్డు మలుపు వద్ద పెద్ద గొయ్యి వర్షం గూడ్స్ షెడ్ రోడ్డు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.