ETV Bharat / state

'ఆ ఎస్సై నుంచి నాకు ప్రాణ హాని ఉంది'

author img

By

Published : Jul 18, 2020, 10:01 AM IST

గతంలో జరిగిన ఓ సంఘటన మనసులో పెట్టుకుని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ఎస్సై సుధాకర్ తనను వేధిస్తున్నారని ఓ యువకుడు ఆరోపించారు. స్టేషన్ పక్క నుంచి వెళ్తున్న తనను పిలిచి వీచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. గతంలోనూ తనను వివిధ సందర్భాల్లో కొట్టారని ఆరోపించారు. ఎస్సై వల్ల తనకు ప్రాణ హాని ఉందని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు యువకుడు.

యువకుడికి చితక్కొట్టిన ఏలేశ్వరం ఎస్సై..!
యువకుడికి చితక్కొట్టిన ఏలేశ్వరం ఎస్సై..!

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన మామిడి రాజు అనే యువకుడు ఎస్సై సుధాకర్ తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించాడు. వెల్డింగ్ షాప్ నడుపుకునే రాజు గతంలో తన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పెట్టినందుకు ఎస్సై స్వాధీనం చేసుకున్నారన్నారని... ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తనపై కక్షసాధిస్తున్నారని తెలిపారు. ఎస్సై తనపై దాడి చేశారని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు రాజు. తనపై కుటుంబం ఆధారపడి ఉందని, ఎస్సై నుంచి తనకు ప్రాణ హాని ఉందని వాపోయారు.

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన మామిడి రాజు అనే యువకుడు ఎస్సై సుధాకర్ తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించాడు. వెల్డింగ్ షాప్ నడుపుకునే రాజు గతంలో తన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పెట్టినందుకు ఎస్సై స్వాధీనం చేసుకున్నారన్నారని... ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తనపై కక్షసాధిస్తున్నారని తెలిపారు. ఎస్సై తనపై దాడి చేశారని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు రాజు. తనపై కుటుంబం ఆధారపడి ఉందని, ఎస్సై నుంచి తనకు ప్రాణ హాని ఉందని వాపోయారు.

ఇదీ చదవండి : యానాంలో టోర్నడో.. మేఘాల్లోకి మోటార్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.