తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు సంబంధించి సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. మూడు కాలువలకు సంబంధించి 2,150 క్యూసెక్కుల విడుదల చేసినట్లు జలవనరుల శాఖ ఏఈ సత్యనారాయణ అన్నారు. ఆత్రేయపురం మండలం లోల్ల లాకుల నుంచి ముక్తేశ్వరం కాలువకు 970 క్యూసెక్కు నీరు, అమలాపురం కాలువకు 756, పి గన్నవరం కాలువకు 424 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఇవీ చదవండి