ETV Bharat / state

ట్రాక్టర్ ఢీ... తల్లి, 28 రోజుల పసికందు దుర్మరణం

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొని తల్లి, 28 రోజుల పసికందు మృతి చెందిన హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లా ఎస్.ఎస్ వెంకటనగరంలో జరిగింది. కొద్ది సెకన్లలో ఇంటికి చేరుకుంటామనుకునేలోగా ఈ ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

author img

By

Published : Jun 15, 2020, 3:14 PM IST

tractor accident at s.s venkatanagaram east godavari district
ట్రాక్టర్ ఢీకొని తల్లి, ఇరవై రోజుల పసికందు మృతి

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్​ ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో తల్లితో పాటు 28 రోజుల పసికందు మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎన్.ఎస్ వెంకటనగరం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్​ఎస్ వెంకటనగరం గ్రామానికి చెందిన వరలక్ష్మి.. తన 28 రోజుల బిడ్డతో కలిసి చీడికలోని తన అమ్మవాళ్ల ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్తోంది. తమ్ముడి ద్విచక్రవాహంపై ఎన్​ఎస్ వెంకటనగరంలోని అత్తగారింటికి సమీపంలోకి రాగానే మట్టి ట్రాక్టర్​ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరలక్షి, ఆమె బిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదనలతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్​ ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో తల్లితో పాటు 28 రోజుల పసికందు మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎన్.ఎస్ వెంకటనగరం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్​ఎస్ వెంకటనగరం గ్రామానికి చెందిన వరలక్ష్మి.. తన 28 రోజుల బిడ్డతో కలిసి చీడికలోని తన అమ్మవాళ్ల ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్తోంది. తమ్ముడి ద్విచక్రవాహంపై ఎన్​ఎస్ వెంకటనగరంలోని అత్తగారింటికి సమీపంలోకి రాగానే మట్టి ట్రాక్టర్​ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరలక్షి, ఆమె బిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదనలతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: అరెస్టు చేస్తేనే.. మృతదేహానికి ఖననం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.