తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో అక్రమ సారా వ్యాపారం జోరుగా కొనసాగుతుండటంతో గ్రామస్థులు తిరగబడ్డారు. స్థానిక మాజీ సర్పంచ్ సహకారంతో వాలంటీర్స్ ఆధ్వర్యంలో గ్రామస్థులు సారా పట్టుకున్నారు. గ్రామంలో వివిధ ప్రాంతాలలో దాచిన వంద లీటర్ల సారాను పారబోశారు. అక్రమ అమ్మకాలు ఆపకుంటే అధికారులకు సమాచారం ఇచ్చి పట్టిస్తామని వ్యాపారస్తులను గ్రామస్థులు హెచ్చరించారు.
ఇదీ చదవండి జిల్లాలో 12వేలు దాటిన కేసులు.. ప్రమాదకరంగా 30 మండలాలు