తూర్పు గోదావరి జిల్లా తునిలో పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ నయీమ్ ఆస్మి విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నేరస్తులను గుర్తించామని.. అందులో ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితులు గౌరీ వెంకట రమణ, దొరబాబుల బలహీనతలు, పాత కేసు, వ్యక్తిగత విషయాల్లో విలేకరి సత్యనారాయణ తల దూర్చినట్లు వెల్లడించారు. రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తానని వేధించడమే కాక.. సొమ్ములు తీసుకుని ఇతర ఇబ్బందులకు గురి చేయగా పగ పెంచుకుని పథకం ప్రకారం హత్య చేశారని దర్యాప్తులో తేలిందన్నారు.
ఇదీ చదవండి: